విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఓ వైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాను చేస్తూనే మరోవైపు పూరి దర్శకత్వంలోని జేజీఎమ్ సినిమాలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. ఇలా ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ తన అభిమానులను ఎంతో అలరిస్తున్నాడు. ఈ సినిమా మాత్రమే కాదు సుకుమార్ దర్శకత్వంలోని సినిమా ను కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ను చేయడానికి సిద్ధమౌవుతున్నాడు.

ఇప్పటికే పూరీ దర్శకత్వంలోని లైగర్ సినిమా ను పూర్తి చేసి విడుదల కు సిద్ధం చేశాడు విజయ్ దేవరకొండ. ఆగస్టు 25 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. అనన్య పాండే హీరోయిన్ గ నటించింది. పాన్ ఇండియా సినిమా గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ కు ఏ స్థాయి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ సినిమా తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో అన్న క్లారిటీ విజయ్ దేవరకొండ ఇవ్వలేదు.

సుకుమార్ తర్వాత movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ లో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఓ పెద్ద దర్శకుడితో ఆయన సినిమా చేస్తున్నాడని అంటున్నారు. ఆ దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. తొందరలో ఈ వివరాలు తెలియనున్నాయి. ఈ ఏడాది తాను ఒప్పుకున్న ఖుషి, జే జీ ఎమ్ సినిమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది సుకుమార్ తో సినిమాలు చేయాలనీ అయన భవిస్తూ ఉండగా తొందర్లో అయన చేయబోయే తదుపరి సినిమాల మీద క్లారిటీ రానుంది. ఖుషి సినిమా లో సమంత హీరోయిన్ నటిస్తుండగా ఈ సినిమా డిసెంబర్ లో 23 వ తదీన విడుదల కానుంది. మరి ఈ సినిమాలు ఆయనకు ఎలాంటి సక్సెస్ ను తెచ్చిపెడతాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: