అమెరికా అధ్యక్ష బరిలో డెమోక్రటిక్ పార్టీ తరుపున బరిలో నిలిచిన బిడెన్ ప్రజల్ని ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో ఇప్పటికి కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటి పోయిందని ఎంతో మంది అమెరికన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారని మరెంతో మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారని ఈ పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని బిడెన్ వ్యాఖ్యానించారు. ప్రతీ రోజు చనిపోతున్న వ్యక్తుల కుటుంభాలు దిక్కు తోంచని పరిస్థితిలో ఉన్నాయని, ఈ మరణాల వల్ల సంభవిస్తున్న నష్టం ఎవరూ తీర్చేలేనిదని చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యం మాత్రం కోల్పోవద్దని, కరోనాతో పోరాటం చేయాలని అందుకు ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని పిలుపు ఇచ్చారు..ఇలా ప్రజలు సలహాలు ఇస్తూనే పనిలో పనిగా అధ్యక్షుడు ట్రంప్ పై విరుచుకుపడ్డారు.
అమెరికా పౌరులు చనిపోతున్నా, ఆర్ధిక మూలాలు దెబ్బ తింటున్నా ట్రంప్ మాత్రం వీటిపై పెదవి విప్పడంలేదని, సాకులు, అబద్దాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ట్రంప్ లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని అమెరికా ఇలా ఆర్ధిక సంక్షోభంలో ఉండటానికి ట్రంప్ ప్రధాన కారణమని అన్నారు. ట్రంప్ కి అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని ఆరోపించారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా ప్రజలపై బాధని వెళ్లగక్కుతూనే ఎన్నికల్లో ఓట్లు వేయమని పరోక్షంగా అభ్యర్ధించారు. అయితే బిడెన్ మాపై బాధని చూపించారా లేక ఓట్ల కోసం అభ్యర్దించారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అమెరికన్స్.