ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తరచూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఎమ్మెల్యే కేసులో ఊహించని స్థాయిలో ట్విస్ట్ చోటు చేసుకోగా ఆ ట్విస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఒక మహిళా నేతతో వీడియో కాల్ మాట్లాడారంటూ ఒక వీడియో సంచలనం అయింది. ఈ వివాదం విషయంలో ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన మహిళతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్యే సైగలు చేస్తూ వ్యవహరించడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే వైరల్ అయినా వీడియో మార్ఫింగ్ చేసిన వీడియో అంటూ మహిళ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ విమర్శలకు బదులిస్తూ తానూ సెల్ఫీ వీడియో తీసుకోగా  ఫోన్ హ్యాక్ చేసి వీడియోను వైరల్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.

తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని మహిళ కోరినట్టు తెలుస్తోంది. మహిళ ఫిర్యాదు నేపథ్యంలో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.  మార్ఫింగ్ చేసి ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో ఈ వీడియోకు సంబంధించి షాకింగ్  విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలలో ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో అర్థం కావడం లేదని  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా ఘటనలు  పాలకులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: