బెంగుళూరు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఐటి రంగం.అందుకే బెంగుళూరును ల్యాండ్ ఆఫ్ ఐటి అని పిలుస్తారు.ఇక ఆ తర్వాత గుర్తుకువచ్చేది ఓ అందమైన నగరం. చాలా అందంగా ఉంటుంది ఈ నగరం.అయితే ఇంత వరకు ఓకే.. ఇప్పుడు టెక్నాలజీ అన్నింటిలో కూడా ముందుంటోంది ఈ నగరం.ఓ స్టార్టప్ కంపెనీ చేసిన ఈ ఆవిష్కరణతో మరోసారి బెంగుళూరు తన ప్రత్యేకతను కాపాడుకుంది. ఎందుకంటే 24*7 పని చేసే ఇక్కడివారికి ఎప్పుడంటే అప్పుడు ఇడ్లీ టిఫిన్ వేడి వేడిగా అందిస్తోంది 'ఇడ్లీ ATM'. బెంగుళూరుకు చెందిన శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ ఈ ఇడ్లీ ఏటీఎంను ఏర్పాటు చేశారు. స్టార్టప్ ఫ్రెషాట్ రోబోటిక్స్‌ ఈ యంత్రాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ వివరాలను ఓ  యూజర్ సోషల్ మీడీయాలో ఈ ఏటీఏం ఇడ్లీ సెంటర్ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్ అవుతోంది. ఇది పూర్తి-ఆటోమేటెడ్, కాంటాక్ట్‌లెస్ ప్రక్రియ ద్వారా నీట్‌గా ప్యాక్ చేసి, స్టీమింగ్ ఇడ్లీలు నిమిషాల్లో డెలివరీ చేయడాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు.


ఈ మెషిన్ ని తయారు చేయాలనే ఆలోచన వ్యక్తిగత అనుభవం నుంచి వచ్చింది. ఇది 2016లో శరణ్ హిరేమత్ తాను అనారోగ్యంతో ఉన్న కుమార్తె కోసం అర్థరాత్రి ఇడ్లీలు కొనాలనుకున్నాడు. ఎక్కడా రెస్టారెంట్లు తెరిచి లేవు. దీంతో ఈ కొత్త ఆవిష్కరణకు తొలి బీజం పడింది.దీన్ని ఇడ్లీ బాట్ లేదా ఇడ్లీ ఏటీఎం అని పిలుస్తారు. ఇడ్లీ తయారు చేయడం, ప్యాకేజీ చేయడం, సప్లై చేయడం లాంటి అన్ని ప్రక్రియలను వెంటవెంటనే చేస్తోంది. అంతే కాదు.. కరెన్సీ కూడా అవసరం లేదు.. ఇందులో డిజిటల్ పే ఫెసిలిటీ కూడా ఉంది.బెంగళూరులో ఫస్ట్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను రెడీ చేసింది ఈ స్టార్టప్. మొత్తం ఆటోమేటెడ్ ప్రాసెస్‌లో పనిచేస్తుంది. కస్టమర్ వచ్చి తమకు కావాల్సిన ఆర్డర్ ఇస్తే చాలు, వేడివేడి ఇడ్లీ పార్శిల్‌లో వచ్చి మన చేతిలో ఉంటుంది. ప్యాకింగ్‌ పల్లి చట్నీ, సాంబార్ కూడా వచ్చేస్తుంది. ఇలా నీట్‌గా ఉన్న పార్శిల్‌ను ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు. లేదా ఇడ్లీ అక్కడే టేస్ట్ చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: