టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గా పేరుపొందారు దిల్ రాజ్.. ఎన్నో సినిమాలను తన ప్రొడక్షన్ హౌస్ మీద నిర్మించి పలు విజయాలను కూడా అందుకున్నారు. ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు దిల్ రాజ్.. అయితే దిల్ రాజ్ కెరియర్ లో ఇప్పటివరకు రీ రిలీజ్ సినిమాల బిజినెస్లకు మాత్రం అడుగుపెట్టలేదు. కానీ తాజాగా ఇందులోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.



గతంలో కొన్ని సినిమాలను దిల్ రాజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు.. ఇప్పుడు తాజాగా రీ రిలీజ్ సినిమాలను నైజాం, వైజాగ్ ఏరియాలో  బిజినెస్ మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.దీంతో ఎవరికి అవకాశం ఇవ్వకుండా తానే ఇకనుంచి అన్ని సినిమాలను 4k  లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రాన్ని 4k లో మొదట ఈ నెల 20వ తేదీ నుంచి నైజాం, వైజాగ్ ఏరియాలలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది దిల్ రాజ్..


దిల్ రాజ్ తన కెరియర్లో ఎలాంటి పని అయినా చేయడానికి సిద్ధంగానే ఉంటారు ముఖ్యంగా రిస్కు వర్కులను చేయడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. గత కొంతకాలంగా దిల్ రాజు వల్ల కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినీ దర్శిని వదిలి వెళ్ళిపోతున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా దిల్ రాజు తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. దిల్ రాజు పోయిన డబ్బులను ఏదో ఒక విధంగా సినిమాలను డిస్ట్రిబ్యూటర్ చేసి సంపాదిస్తూ ఉంటారు.  రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి  రేపు వాతావరణం వ్యవహరిస్తున్నారు ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించడం జరుగుతోంది. ఏది ఏమైనా దిల్ రాజు పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళుతూ ఉంటారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: