

ఇకపోతే ఈవెంట్ ఎవరిది అన్న విషయాన్ని వస్తే.. అక్కినేని అఖిల్ తో నిశ్చితార్థం చేసుకొని వివాహం రద్దు చేసుకున్న ప్రముఖ మోడల్ శ్రియ భూపాల్ శ్రీమంతం వేడుకలు.. అఖిల్ అక్కినేనితో నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత వివాహానికి రద్దు చెప్పుకున్న వీరు.. 2018 జూలై ఆరవ తేదీన ఆనందిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తనుఆమె వివాహం చేసుకుంది. అయితే తాజాగా ఆమె గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై పార్టీలో సందడి చేశారు. ఇకపోతే శ్రీయ భూపాల్ పెళ్లికి ఉపాసన , రాంచరణ్ దంపతులు కూడా హాజరైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా గతంలో అఖిల్ అక్కినేని శ్రియ భూపాల్ నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి బ్రేకప్ చెప్పుకున్న తర్వాత అఖిల్ పూర్తిగా తన దృష్టిని సినిమాలపైనే ఉంచారు . ఇక ఆయన మళ్లీ పెళ్లి అనే ఊసే ఎత్తలేదు. కానీ శ్రీయ భూపాల్ మాత్రం ఇప్పుడు వివాహం చేసుకొని తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.