
అయితే ఈ సినిమాల విడుదలే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందుకు ప్రధాన కారణం కరోనా వైరస్ మాత్రమే. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 700 పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కూడా ఆదేశించారు. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. అటు దేశ వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమలు చేస్తోంది కేంద్ర హోమ్ శాఖ. ఇక ఢిల్లీ ప్రభుత్వం అయితే థియేటర్లు, మల్టీపెక్స్లపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఇదే జాబితాలో ఇతర రాష్ట్రాలు కూడా చేరనున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో బాలీవుడ్లో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. జెర్సీ హిందీ వర్షన్ సినిమా వాయిదా పడటంతో... ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పరిస్థితి ఏమిటన్నది అర్థం కావటం లేదు.