ఇక మన చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.చరిత్రలో ఈ రోజు జులై 8వ తేదీన జరిగిన సంఘటనలు చూసుకున్నట్లయితే...1497 వ సంవత్సరంలో వాస్కోడి గామా ఇండియాకి దారి కనుక్కోవటానికి లిస్బన్ రేవుని వదిలి బయలు దేరాడు.1954 వ సంవత్సరంలో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, భాక్రానంగల్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది.2008వ సంవత్సరంలో కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడటం జరిగింది.ఇక మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకోవడం జరిగింది.

ఇక చరిత్రలో జులై 8 వ తేదీన జరిగిన ప్రముఖుల జాననాలు చూసినట్లయితే...1914 వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు జన్మించారు.1921 వ సంవత్సరంలో పారిశ్రామిక వేత్త, దార్శనికుడు ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ జన్మించారు.ఇక 1949 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు జన్మించారు.1966 వ సంవత్సరంలో ప్రముఖ భారతీయ సినీనటి రేవతి జన్మించారు.1969 వ సంవత్సరంలో దక్షిణ భారత సినిమా నటి సుకన్య జన్మించారు.ఇక 1972 వ సంవత్సరంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంకా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి జన్మించారు.

ఇక మరణాల విషయానికి వస్తే..1972 వ సంవత్సరంలో పాలస్తీనాకు చెందిన రచయిత పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి (Popular Front for the Liberation of Palestine) నాయకుడు ఘసన్ కనాఫానీ చనిపోయారు.1978 వ సంవత్సరంలో తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు నాయని సుబ్బారావు చనిపోయారు.ఇక 1985 వ సంవత్సరంలో అమెరికా ఆర్థికవేత్త సైమన్ కుజ్‌నెట్స్ చనిపోయారు.2006 వ సంవత్సరంలో రాజారావు అనే ఆంగ్ల నవలా ఇంకా కథా రచయిత ఇంకా పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చనిపోయారు.2007 వ సంవత్సరంలో భారత మాజీ ప్రధానమంత్రి, చంద్రశేఖర్ చనిపోయారు.2016 వ సంవత్సరంలో పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు అబ్దుల్ సత్తార్ ఈది చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: