దేశంలో కరోనా మార్చి నుంచి మొదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినీ పరిశ్రమ పూర్తిగా మూసివేయబడింది.  సెలబ్రెటీలు ఇంటి పట్టున ఉంటున్న విషయం తెలిసిందే. ఈ మద్యనే లాక్ డౌన్ సడలింపు.. షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ జరిగిన ప్రతిచోట కరోనా కేసులు రావడంతో చాలా మంది సెలబ్రెటీలు భయంతో వణికిపోతున్నారు.  తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కి కూడా కరోనా పాజిటీవ్ వచ్చిందని ఆయనే స్వయంగా తెలిపారు.  ఇదిలా ఉంటే.. ప్రముఖ  దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మద్య కరోనా లక్షణాలు కనిపించడం తో వైద్యులను సంప్రదించానని.. త‌న‌కి పాజిటీవ్ అని తేలింద‌ని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నేను ఇప్పుడేంటి.. గ‌త అర‌వై, డ‌భై ఏళ్లుగా పాజిటీవ్‌నే.. అంటూ ఛలోక్తులు వేశారు.. అంతే కాదు క‌రోనాని సైతం లైట్ తీసుకున్నారు. ఇక అంతే కాదు తన అభిమానులు, స‌న్నిహితులు, స్నేహితులు కంగారు ప‌డొద్ద‌ంటూ.. త‌న ఆరోగ్యం పూర్తిగా అదుపులోనే ఉంద‌ని, త్వ‌ర‌లోనే పూర్తిగా కోలుకుంటానని అన్నారు. ఇక సింగీతం సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం ఆయన ఓ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. దానికి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు జరుగుతున్నాయి.


ప్రస్తుతం డాక్టర్ల సూచనలు పాటిస్తూ ఐసొలేషన్‌లో ఉన్నాను, ప్రత్యేకమైన గదిలో గడుపుతుంటే హాస్టల్ రోజులు గుర్తొస్తున్నాయి.. సెప్టెంబర్ 22తో క్వారంటైన్ పూర్తవుతోంది.. తర్వాత ఎప్పటిలానే నాకిష్టమైన పుస్తకాలు చదువుతాను.. నా యోగక్షేమాలు తెలుసుకుంటూ, నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు సింగీతం శ్రీనివాస రావు. కరోనా వచ్చినంత మాత్రానా భయపడొద్దని .. ధైర్యంగా ఎదుర్కోవాలని.. అందుకోసం ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని అన్నారు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: