టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ గా పేరు పొందిన వారిలో సమంత-మహేష్ బాబు ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో పలుసినిమాలు వచ్చాయి. అలాగే సమంత సైతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారింది. ‘ఏ మాయ చేశావే’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘మనం’, ‘అ ఆ’ దూకుడు వంటి సినిమాల్లో ఆమె నటనని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఇదిలా ఉంటే సమంత ఎప్పుడైతే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ ని జరుపుకుందో...అప్పటి నుండి టాప్ హీరోల సరసన నటించేముందు కొంత ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు నుండి పలు సార్లు ఆఫర్స్ వస్తే...తను నటించేది లేదంటూ చెప్పుకొచ్చింది. దీనికి మహేష్ బాబు సైతం షాక్ అయ్యాడు. అయితే తాజాగా మహేష్ బాబు అప్ కమింగ్ మూవీలో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అంతే కాకుండా మహేష్ బాబు గొప్పతనాన్ని సైతం నాగచైతన్య ముందు చెప్పుకొచ్చింది.
‘‘మహేశ్ తో నటించాలనేది ప్రతి హీరోయిన్ డ్రీమ్. నాకు ఆ అవకాశం చాలా త్వరగానే...ఎక్కువ సార్లు వచ్చింది. తన పక్కన చేస్తుంటే ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అటువంటి సమంయలో హీరోయిన్ చాలా బాధ్యతగా ఉండాలి. మొత్తంగా చెప్పాలంటే మహేష్ బాబు గ్రేట్ యాక్టర్. గ్రేట్ పర్సన్. ‘ప్రతి సినిమానీ నీ మొదటి సినిమాగా భావించి పని చెయ్యి’ అనేది మహేష్ బాబు అందరికీ చెప్పే మొదటి మాట.
అలాగే నాకూ చెప్పారు. ఇంతటి మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తితో మరోసారి పనిచేయటం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పుకొచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో ‘దూకుడు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’వంటి చిత్రాలు వచ్చాయి.