నిత్యా నంద గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుల్లో నిత్యానంద విషయంలో భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి.

నిత్యానంద వల్ల కెరీర్ ను నాశనం చేసుకున్న హీరోయిన్లలో రంజిత కూడా ఒకరు. రంజిత తండ్రి అశోక్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను అయితే వెల్లడించారు. అప్పట్లో నేను హైదరాబాద్ లో పోలీస్ గా పని చేశానని ఆయన తెలిపారు.

ఆ తర్వాత ఉద్యోగం మానేసి హోటల్ వ్యాపారం చేయగా ఆ వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయని అశోక్ కుమార్ అన్నారు. మద్రాస్ కు వెళ్లి సినిమా ప్రయత్నాలు చేయగా 40 సంవత్సరాలలో కేవలం 25 సినిమాలు చేశానని కూడా ఆయన తెలిపారు. తాను విలన్ రోల్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని సినిమాలలో నన్ను హీరోగా తీసుకున్నారని కానీ ఆ తర్వాత తొలగించారని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.

పోలీస్ ఆఫీసర్ గా పని చేయడం వల్ల నాకు పొగడటం అనేది అలవాటు లేదని అశోక్ కుమార్ అన్నారటా.సినిమా ఇండస్ట్రీలో పొగిడితే తప్ప అస్సలు పనులు కావని ఆయన కామెంట్లు చేశారు. రంజిత నా కూతురు అని నిత్యానంద, రంజితలకు పెళ్లి జరిగినట్టు ఫోటోలు కూడా ఉన్నాయని అయితే ఆ ఫోటోలు నిజమో కాదో మాత్రం తెలియదని ఆయన తెలిపారు. రంజితకు సినిమాలు ఇష్టం లేకపోయినా సినిమాలు చేసిందని అశోక్ కుమార్ అన్నారు.

రంజితది లవ్ మ్యారేజ్ అని ఆమె భర్తతో విడాకులు తీసుకుందని కూడా తెలిపారు. నిత్యానందతో నేను గొడవ పడ్డానని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారటా.రంజిత అక్క, రంజిత ఇద్దరూ కూడా భర్తలకు దూరంగా ఉంటూ నిత్యానంద ఆశ్రమంలో నే ఉన్నారని ఆయన తెలిపారు. ఫైనాన్షియల్ గా హ్యాపీ అని అశోక్ కుమార్ తెలిపారు. మేము సంతోషంగా ఉన్నామని తన మూడో కూతురుకు మాత్రం రంజిత అక్క, రంజిత మెసేజ్ పెడతారని ఆయన అన్నారు. రంజిత జీవితంలో జరిగిన ఘటనలను భరించలేక తల్లి చనిపోయిందని కూడా అశోక్ కుమార్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: