కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . స్టార్ట్ హోదా ఉన్న కూడా చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని సినిమాలను ఓకే చేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా అందరి హీరో లు పాన్  ఇండియా రేంజ్ వచ్చాక సినిమాకి డబుల్ డబుల్ రేంజ్  రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ ఉంటే .. ధనుష్ మాత్రం తన రేంజ్ కన్నా ఇంకా తక్కువ రేంజ్ తీసుకుంటూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీ అంటే ఆయనకి అంత ఇష్టం . ఆయన ద్వారా నలుగురు ఇండస్ట్రీలో బాగుపడాలి అంటూ కోరుకుంటున్నారు. కాగా రీసెంట్గా "కుబేర" సినిమాతో తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టి క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో ధనుష్ ఇప్పుడు సరికొత్త కాన్ సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు .
 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో ధనుష్ నటించిన తాజా సినిమా "కుబేర". ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలుసు.  ఈ సినిమా ధనుష్ లోని మరో యాంగిల్ ని బయటపెట్టింది . కాగా ఈ సినిమా తర్వాత ధనుష్ ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నాడు ..? ఎలా కనిపించబోతున్నాడు..? అని అంతా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు.  అలాంటి వాళ్ళకి క్రేజీ అప్డేట్ వచ్చేసింది . ధనుష్ తన కెరీయర్లో 54వ సినిమాను  దర్శకుడు విగ్నేష్ రాజాతో అనౌన్స్ చేశాడు . ఈ సినిమాపై రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు ఆసక్తి రేపుతుంది .



ఇందులో ధనుష్ నిలబడి దిగాలుగా కనిపిస్తూ ఉండగా తన పత్తి పంట కాలిపోతున్న దృశ్యాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా ఎమోషనల్ డ్రామా అంటూ ఫస్ట్ పోస్టర్ తోనే అర్థం అయిపోతుంది. ఈ సినిమాలో ధనుష్ ఒక రైతుగా కనిపిస్తాడు అంటూ కూడా తెలిసిపోతుంది . మొత్తానికి గతంలో బిచ్చగాడు గెటప్ లో కనిపించి వాళ్ల బాధలు కళ్లకి కట్టిన్నట్లు చూయించిన ధనుష్ .. ఇప్పుడు రైతుల బాధలను అర్థం చేసుకుని.. ఒక ప్రిస్టీజియస్ ప్రాజెక్టులో నటించబోతున్నాడు అంటూ తెగ పొగిడేస్తున్నారు జనాలు . ధనుష్ మరో సాలిడ్ రూరల్ ఎమోషనల్ డ్రామతో రాబోతున్నారు అని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: