సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఆమెకు ఉన్న పేరు, గౌరవం అందరికీ తెలిసిందే. రొమాంటిక్ పాత్రల నుంచి సీరియస్ క్యారెక్టర్స్ వరకు ఎలాంటి రోల్స్ అయినా అవలీలగా పోషించే నైపుణ్యం ఆమెకు ఉంది. నటనలో చూపించే వైవిధ్యం, పాత్రల్లో కలిసిపోవడం, ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని తీసుకురావడం వల్లే సమంతకు ఈ స్థాయి గుర్తింపు వచ్చింది. అయితే, తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన సమంత ఒక ప్రత్యేకమైన సీన్‌లో మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు.


సినిమా మరెవ్వరిదీ కాదు, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘బృందావనం’. ఈ చిత్రంలో సమంతతో పాటు కాజల్ అగర్వాల్ కూడా మరో హీరోయిన్‌గా నటించింది. లో క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ అంతటి స్థాయిలో ఉండడంతో అది జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో మలుపుతిప్పిన సినిమాగా నిలిచింది. ‘బృందావనం’లోని పాటలు, ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, వేణుమాధవ్ హాస్య సమయాలు, ప్రకాష్ రాజ్, శ్రీహరి చేసిన సీరియస్ ప్లస్ కామెడీ మిక్స్ యాక్టింగ్—అన్ని కలిసి ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిపాయి. కాజల్ అగర్వాల్, సమంతల మధ్య జరిగే మాటల యుద్ధం, ఎన్టీఆర్ .. కాజల్ ఇంటికి వెళ్లిన తర్వాత చోటుచేసుకున్న సంఘటనలు, ఇంటర్వెల్ ట్విస్ట్—అన్ని సూపర్. ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు ఎంత బాగా ఆడిందో, నేటికీ టెలివిజన్‌లో ప్రసారమైనప్పుడల్లా అభిమానులు ఆసక్తిగా కూర్చుని చూస్తారు.



అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. క్లైమాక్స్‌లో వచ్చే ఒక పాట సన్నివేశంలో సమంతకి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంలో చాలా కష్టం ఏర్పడిందట. ఆ సన్నివేశంలో ఆమె సరదాగా నవ్వుతూ, అందరితో సరదాగా మాట్లాడుతున్న మూడ్ నుండి ఒక్కసారిగా సీరియస్ ముఖం పెట్టుకోవాలి. ఆ అవసరమైన ఎమోషన్‌ను సరిగ్గా చూపించడానికి సమంత చాలా కష్టపడినా, ఆ భావోద్వేగం సహజంగా రావడం లేదు. దర్శకుడు కూడా ఎన్నో సార్లు ప్రయత్నం చేసినా, సీన్ రైట్‌గా రాలేదు. చివరకు 37వ టేక్‌లోనే ఆ సన్నివేశం సక్సెస్ అయ్యింది.



ఈ విషయాన్ని సమంత ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. “నా కెరీర్‌లో అది చాలా హార్డ్ సీన్. నేను మొదటిసారి అంతగా స్ట్రగుల్ అయిన సీన్ అది” అంటూ చెప్పింది. నటనలో ఎంత టాలెంట్ ఉన్నా, కొన్ని సన్నివేశాలు ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ఆ కష్టమే తర్వాత మనకు మరింత అనుభవాన్ని ఇస్తుందని సమంత ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ‘బృందావనం’ సినిమా సమంత కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. నేటికీ ఈ సినిమా పాటలు, సీన్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఎన్టీఆర్, సమంత, కాజల్ ముగ్గురి కెరీర్‌లో కూడా ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: