వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్జీవి తీస్తున్న ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ కి వెళ్లి మరీ దాడి కూడా చేయడం జరిగింది. దీంతో పోలీస్ కేసు అవ్వటంతో మీడియాలో ఈ వార్త హైలెట్ అయ్యింది. వర్మ తీస్తున్న ఈ సినిమా వెనకాల వైసీపీ పార్టీ ఉందని ఇటీవల వార్తలు వస్తున్న తరుణంలో...వైసిపి పార్టీ తరఫున గుడివాడ అమర్నాథ్ రెడ్డి రంగంలోకి దిగి వస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టాడు. రామ్ గోపాల్ వర్మ కి అదే రీతిలో వైసీపీ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. 
IHG
ఆయన తీస్తున్న పవర్ స్టార్ సినిమాకి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కావాలని చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నారు అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కి విశాఖపట్టణం ఎలాంటి అవకాశాలు ఇచ్చిందో అందరికీ తెలుసు అని అలాంటి విశాఖపట్టణానికి ద్రోహం చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారని గుడివాడ అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. 
IHG
తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా పవన్ ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అందుకే ప్రజలు ముందుగానే పవన్ కళ్యాణ్ ని రెండు చోట్ల ఓడించారని అయినా కానీ పవన్ కళ్యాణ్ వైఖరిలో సిగ్గు రావడం లేదని దురదృష్టకరమని పేర్కొన్నారు. అదే రీతిలో చంద్రబాబు ని కూడా ప్రజలు చీ కొడితే ఇద్దరూ కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నట్లు గుడివాడ అమర్నాథ్ రెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: