జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఇంతే. ఎక్కడేమి మాట్లాడిన తన అజ్ఞానాన్ని తానే బయటపెట్టేసుకుంటారు. తాజాగా మరోసారి తనలోని అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇస్తు పవన్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. తెలంగాణాను, తెలంగాణా ప్రజలను ఏమన్నా అంటే ఊరుకోరట. ఏదన్నా ఉంటే డైరెక్టుగా వ్యక్తులను లేదా మంత్రులను మాట్లాడాలే కానీ ప్రజలను, తెలంగాణాను కించపరిస్తే సహించనని వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు, వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు.





ఇక్కడే పవన్లోని అజ్ఞానమంతా బయటపడింది. జనాలు పవన్ను చూసి నవ్వుకుంటున్నారు. విషయం ఏమిటంటే ఆమధ్య తెలంగాణా మంత్రి హరీష్ రావు ఏపీలో పాలన, డెవలప్మెంట్ పై నోరు పారేసుకున్నారు. దానికి ఏపీ మంత్రులు గట్టిగా రిప్లై ఇచ్చారు. ఒకటిరెండురోజులు రెండువైపులా మాటలయుద్ధం జరిగి ముగిసిపోయింది. అంతా అయిపోయిన నాలుగురోజులకు పవన్ హఠాత్తుగా మేల్కొన్నారు. హరీష్ ను ఏమీ అనలేక ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది. పైగా హరీష్ ఏమన్నారో పవన్ కు తెలీదట.





హరీష్ ఏమన్నారో తెలిస్తే కదా ఏపీ మంత్రులు ఎలా రియాక్టయ్యారో తెలిసేది. హరీష్ ఏమన్నారో తెలీకుండానే ఏపీ మంత్రులను పవన్ ఎలా తప్పుపట్టారు ? మంత్రులకు పవన్ వార్నింగు ఇవ్వటం ఏమిటో అర్ధంకావటంలేదు. హరీష్ ఏమన్నారో తెలీకుండానే వివాదంలో పవన్ను ఎవరు తలదూర్చమన్నారు ?





వివాదంలో జోక్యం చేసుకునే ముందే అసలు హరీష్ ఏమన్నారు ? దానికి ఏపీ మంత్రులు ఎలా  రియాక్టయ్యారో తెలుసుకుని మాట్లాడాలి. తనకు తెలీదంటూనే ఏపీ మంత్రులకు వార్నింగులు మాత్రం ఇచ్చేశారు. ఇక్కడే పవన్లోని అజ్ఞానమంతా బయటపడింది. పవన్ సింగిల్ పాయింట్ అజెండాతో నడుస్తున్న విషయం తెలిసిందే. నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడాలన్నది పవన్ అజెండా. సంబంధంలేని విషయాల్లో కూడా జగన్ను పిక్చర్లోకి లాగేసి పవన్ నోటికొచ్చింది మాట్లాడుతున్న విషయం అందరు చూస్తున్నదే. బహుశా రాబోయే ఎన్నికల్లో తెలంగాణా ఓట్ల కోసం ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వటానికి కూడా పవన్ వెనకాడలేదని అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: