భారత్లో కొవిడ్-19 రెచ్చిపోతోంది. అందులోనూ మహారాష్ట్రంలో మాత్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. రికార్డుస్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు 3,205 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. దేశ వాణిజ్యరాజధాని ముంబైలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో భారత్లో ఇప్పటివరకు మొత్తం 13,430 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 448మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. రోజూ వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి.
ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 21 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 1,44,515 మంది మృతి చెందారు. ఇక అమెరికాలో అయితే మరణ మృదంగమే. ఇప్పటివరకు అమెరికాలో 6,69,378 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యా. 34103మందికిపైగా మృతి చెందారు. అమెరికా ఇప్పుడు కొవిడ్-19కు హాట్స్పాట్గా మారింది. ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు యూఎస్లోనే నమోదు అవుతున్నాయి.