
త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుంది . ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున నే హోస్టుగా చేయబోతున్నాడు అంటూ దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే ఈసారి సీజన్ 9 లో మాత్రం కంటెస్టెంట్స్ ను తోపైన సెలబ్రిటీస్ తీసుకురాబోతుందట మేనేజ్మెంట్ . మరీ ముఖ్యంగా పలువురు యూట్యూబర్స్ తో పాటు కాంట్రవర్షియల్ కంటెంట్ ఎక్కువగా ఇచ్చే స్టార్స్ ని రంగంలోకి దించుతుందట. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని విధాలుగా ఆలోచించి కంటెస్టెంట్ లను ఫైనలైజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది . మరీ ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లోకి అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ లో ఒకరు ఫైనలైజ్ అయ్యారు అంటూ టాక్ వినిపిస్తుంది .
ఈ మధ్యకాలంలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ ఎంత హైలెట్గా మారిందో తెలిసిందే. అంతేకాదు సీరియల్ స్టార్స్ అదే విధంగా ప్రముఖ యూట్యూబర్స్ ని ఈ సీజన్లో సెలెక్ట్ చేసుకున్నారట. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా విడాకులు తీసుకున్న ఒక స్టార్ సింగర్ కపుల్ ని ఈ హౌస్ లోకి పంపించబోతున్నారట . విడాకులు తీసుకున్న కపుల్ ని హౌస్ లోకి పంపిస్తే ఎంత కాంట్రవర్షియల్ కంటెంట్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. దాని ప్రకారం బిగ్ బాస్ ఈ విధంగా టిఆర్పి రేటింగ్స్ పెంచుకోవడానికి ఆ మోస్ట్ లవబుల్ విడాకులు తీసుకున్న కపుల్స్ ని హౌస్ లోకి పంపేలా ఫైనలైజ్ చేసిందట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈసారి కాంట్రవర్షియల్ కంటెంట్ బాగానే వచ్చేలా ప్లాన్ చేసుకుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్ అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు జనాలు . తుది జాబితాను బిగ్ బాస్ నిర్వహకులు అధికారికంగా తెలియజేసే వరకు వెయిట్ చేయాల్సిందే..!