ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి సారించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్... అన్ని వర్గాల ప్రజలకు హామీల వర్షం కురిపించారు. అలాగే కేవలం రెండే పేజీలతో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే నవరత్నాల పేరుతో ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేశారు కూడా. ఇక ప్రతి ఏటా సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేక క్యాలెండర్ కూడా రూపొందించారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత క్లిష్టంగా మారిపోయింది. చివరికి సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి.

దీంతో ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది జగన్ సర్కార్. ఇప్పటికే రకరకాల మార్గాల ద్వారా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా కొత్త ఆస్తి పన్ను ప్రభావం కూడా మొదలు కానుంది. ప్రస్తుతం తాజాగా సవరించిన ఆస్తిపన్ను ప్రకారమే ఆయా పురపాలక సంఘాలు కూడా డిమాండ్ నోటీసులను జారీ చేస్తున్నాయి ఇప్పుడు. గతంలో అద్దె విలువ ప్రకారం పన్ను విధించే వాళ్లు. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఆస్తి మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించాలని జగన్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసేసుకుంది. దీని వల్ల ప్రస్తుతం ఉన్న పన్ను కంటే కూడా ఆస్తి పన్ను 10 నుంచి 15 శాతం పెంచేసింది ప్రభుత్వం. సవరించిన పన్నులతో కూడిన కొత్త నోటీసులను కూడా ఇప్పటికే మునిసిపల్ అధికారులు అన్ని ఇళ్లకు అందజేస్తున్నారు కూడా. ఇప్పటికే పెరిగిన పన్నులు, ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో చేదు వార్త. త్వరలో ప్రభుత్వం పెంచిన ఆస్తిపన్ను మేరకు నోటీసులను అందిస్తోంది. ఈ మేరకు కొత్తగా సవరించిన ఆస్తిపన్ను కట్టాల్సి ఉంటుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరం తొలి ఆరునెలలకు నోటీసులను ప్రభుత్వం జారీ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: