ఆనాడు తెలుగుదేశం పార్టీ ని తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తెలుగు పైన స్థాపించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనే విషయంపై మండిపడుతున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ కార్యకర్తలు.
ఇటువంటి సమయంలో రామారావుగారి ఉండి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేదని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తో పొత్తు అనే వార్తల పై ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు...ఆ వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు...కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు.
ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏపీలో ఇప్పుడు టీడీపీపై తీవ్రంగా మండిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో అందరికి తెలుసు…మళ్లీ ఇప్పుడు టీడీపీ పోత్తు పెట్లుకుంటే వచ్చే ఎన్నికల్లో అదే గతి పడుతుందని కొందరు హెచ్చిరిస్తున్నారు.
తన స్వార్ధ రాజకీయాలకోసం ఆంధ్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్ర ప్రజల గుండెల్లో నాటుకుపోయిందని...అటువంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో తెలుగుదేశం రాజకీయాలలో చంద్రబాబు ఉండరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ తో పొత్తు ఉంటే కచ్చితంగా టిడిపి ఓటమి ఖాయమని పేర్కొంటున్నరు.