బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించి సీరియల్స్ లోనూ నటిస్తూ ఎంతో మంచి పాపులారిటీ దక్కించుకున్న వారిలో నటి జ్యోతి రెడ్డి కూడా ఒకరు. 9 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జ్యోతి రెడ్డి ఇప్పటికీ సీరియల్స్ సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తోంది జ్యోతి రెడ్డి. ఇకపోతే తాజాగా ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలను తెలియజేసిందామె.

సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రాం రెడ్డి గారి మనవరాలిని అంటూ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి పెట్టారు. 9 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన ఈమె వరుసగా అవకాశాలు అందుకొని మంచి పాపులారిటీ దక్కించుకుంది. డైరెక్టర్ల పిఏలు కూడా తమ ప్రాజెక్టులో నటించమని తన ఇంటి ముందుకు కట్టేవారు అంటూ జ్యోతి రెడ్డి వెల్లడించింది. ఇక తనకు చదవడం అంటే చాలా ఇష్టం అని బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని లక్ష్యం ఉండేదని అలా డిగ్రీ, ఎమ్ఏ, ఎమ్ ఫీల్ వరుసగా పూర్తిచేసి వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ కూడా సొంతం చేసుకుంది.

అయితే మా ఇంటి ముందు డైరెక్టర్ల పిఏలు క్యూ కట్టడం చూసినటువంటి మా అమ్మ ఇంత పెద్ద వాళ్ళు నీ కోసం వస్తున్నారు కదా నువ్వు ఎందుకు అవకాశాలు వదులుకుంటావు అంటూ నన్ను ఇండస్ట్రీ వైపు వెళ్లేలా ప్రోత్సహించింది. అంటూ జ్యోతి రెడ్డి వెల్లడించారు.  ఇకపోతే అమ్మ ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపిన ఆమె తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తారని వెల్లడించారు. ఇకపోతే వారికి ఇద్దరు పిల్లలు కాగా వారి బాగోగులు అన్ని తన తల్లి చూసుకుంటున్నారని జ్యోతి రెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: