మాజీ హీరోయిన్ లకు ఇప్పుడు అన్ని భాషల్లో కూడా మంచి డిమాండ్ ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. వారిని సినిమాల్లోకి తీసుకుని మంచి పాత్రలు ఇవ్వడం వాటికి నటనకు ప్రాధాన్యత ఉండటం తో వారికి మంచి ఆదరణ అనేది లభిస్తుంది. దాదాపు అన్ని భాషల్లో కూడా ఇదే ట్రెండ్ ఉందని అర్ధమవుతుంది. పైగా నిన్న‌టి త‌రంలో తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో న‌టించి మంచి గుర్తింపు ఉన్న సీనియ‌ర్ హీరోయిన్ల‌ను ఇప్పుడు సినిమాల్లోకి తీసుకుని త్లి పాత్ర‌లో లేదా ఆంటీ పాత్ర‌లో ఇస్తే ఆ సినిమాకు మిగిలిన భాష‌ల్లోనూ ఎంతో కొంత క్రేజ్ అయితే వ‌స్తోంది. పైగా పాన్ ఇండియా సినిమా అని పేరు పెట్టి తెలుగులో సినిమా తీసినా అటు త‌మిళ్ తో పాటు క‌న్న‌డ‌, మ‌ళ‌యాళంలో కూడా రిలీజ్ చేసుకుంటూ సొమ్ములు చేసుకుంటున్నారు.

 

ఇక ఇది పక్కన పెడితే  మన తెలుగులో ఒక ఇద్దరు సీనియర్ హీరోయిన్ లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. నిన్న‌టి త‌రం హీరోయిన్లు అయిన భూమిక, స్నేహ కు మంచి పాత్రలు ఇస్తున్నారు టాలీవుడ్ జనాలు. అందులో ప్రధానంగా స్నేహ కు ఇచ్చే పాత్రలు అన్నీ కూడా అగ్ర హీరోల సినిమాల్లోనే ఉంటున్నాయి. సినిమా ఫ్లాప్ అయినా సరే ఆమె పాత్ర మాత్రం చాలా బాగా క్లిక్ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెను రెండు అగ్ర హీరోల సినిమాల్లో తీసుకునే ప్రయత్నాలను దాదాపుగా చేస్తున్నారు. మహేష్ బాబు సినిమాలో ఆమె ఖరారు అయింది.

 

అదే విధంగా ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమాలో కూడా ఆమె విలన్ పాత్రలో ఉండే అవకాశం ఉందని స‌మాచారం. అంటే స్నేహ విలన్ కి తల్లి గా నటిస్తుందని, అరవింద్ స్వామికి తల్లి గా ఆమె చేసే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే అర‌వింద్ స్వామి చిన్న‌ప్ప‌టి రోల్‌లో ఉంటుంద‌ని.. త‌ర్వాత ట్విస్ట్ ఉంటుంద‌ని స‌మాచారం.  ఎంత వరకు నిజమో గాని ఇప్పుడు ఆమె అందుకు భారీగా డిమాండ్ చేసింది అని కూడా టాక్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: