టాలీవుడ్ లో ఈ మద్య కొత్త హీరోయిన్లు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రకూల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, రెజీనా లాంటి హీరోయిన్లతో పాటు మెహ్రిన్, అను ఎమ్మాన్యుయేల్ లాంటి వాళ్లు కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘ఊహలు గుసగుసలాడే’సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రాశీఖన్నా. సుప్రీమ్ సినిమాలో సాయిధరమ్ సరసన నటించిన ఈ అమ్మడు మంచి క్రేజ్ సంపాదించింది. ఇండస్ట్రీలో ఇప్పుడు రాశీఖన్నా లక్కీ హీరోయిన్ అంటున్నారు.
దీనికి తగ్గట్టు ఈ అమ్మడికి వరుసగా చాన్సులు కలిసి వస్తున్నాయి. తెలుగులోనే కాకుండా ఈ మద్య కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇమైకా నోడిగళ్ చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటూ జనవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. జయంరవి ప్రస్తుతం శక్తి సౌందర్రాజన్ దర్శకత్వంలో టిక్ టిక్ టిక్ చిత్రంలో నటిస్తున్నారు. తొలి అంతరిక్ష కథా చిత్రంగా తెరకెక్కుతున్న టిక్ టిక్ టిక్ నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
తదుపరి జయంరవి సుదర్.సి దర్శకత్వంలో భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్రలో ఆర్యతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం 2018 ఏప్రిల్లో సెట్పైకి వెళ్లనుందని సమాచారం. దీంతో జయంరవి ఈ మధ్యలో ఒక చి త్రం చేయాలని నిర్ణయించుకున్నారట. తంగవేల్ దర్శకత్వంలో హోమ్ మూవీస్ సంస్థ నిర్మించనున్న మొదటి చిత్రంలో నటించనున్నారు. సీఎస్.శ్యామ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రానికి సంబం ధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారకపూర్వకంగా వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.