ప్రతిరోజు రోజు స్కూల్ కి వెళ్లి వచ్చే టీచర్ రోజు లాగానే స్కూల్ కి వెళ్లాడు.  కానీ మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో  కంగారు పడిపోయిన కుటుంబసభ్యులు ఊరంతా గాలించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఆ తర్వాత రోజు సమీపంలోని ఓ కెనాల్లో శవమై కనిపించాడు  స్కూల్ టీచర్.  ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం సృష్టించింది. షాకింగ్ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 వివరాల్లోకి వెళితే.. సంతమాగులూరు మండలం పడ్డవారి పాలానికి చెందిన రామాంజనేయులు అదే మండలం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఉంటాడు. అతని కుటుంబం వినుకొండ పట్టణంలో నివాసం ఉంటుంది. అయితే ఇటీవలే స్కూల్ కి అని చెప్పిన వెళ్లిన రామాంజనేయులు సాయంత్రం అయినప్పటికీ ఎంతకీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు కంగారు పడిపోయారు. బంధువులందరికీ ఫోన్ చేసి అడిగినప్పటికీ ఆచూకీ మాత్రం లభించలేదు. చుట్టూ పక్కల ప్రాంతాల్లో కూడా వెతికారు.



 అయినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. కానీ ఆ తర్వాత రోజు ఉదయం సమయంలో అడవి పాలెం సమీపంలో అద్దంకి బ్రాంచి కెనాల్ లో శవం  పైకి తేలి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే వీఆర్వో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి టీచర్ రామాంజనేయులు గా గుర్తించారు. అయితే స్కూల్ అయిపోయిన తర్వాత అద్దంకి బ్రాంచ్ కెనాల్ వైపు రామాంజనేయులు వెళ్ళినట్లుగా కొంతమంది స్థానికులు చెప్పారు. ఈ క్రమంలోనే సదరు టీచర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా హత్య జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: