ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రేపటితో ముగియనున్నాయి.. రేపటి రోజున పోలింగ్ రోజు కావడం చేత అభ్యర్థులు అందరూ కూడా కాస్త ఆందోళనలతో ఉన్నారు. ఇటివలె చంద్రబాబు నాయుడు కు బహిరంగ సవాల్ విసిరారు  వైసిపి నేత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. తాను కానిపాక వినాయకుడు గుడిలో ప్రమాణం చేస్తానని చంద్రబాబు కూడా అక్కడికి వచ్చే ప్రమాణం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. నన్ను చంద్రబాబు చిన్న సైకో అంటున్నారు.. మరి మూడుసార్లు బీఫామ్ ఇచ్చిన చంద్రబాబు బొల్లి సైకో ముసలి సైకో అవుతాడా అంటూ కూడా సెటైర్లు వేశారు.


వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ఇప్పటికైనా చంద్రబాబు అసలు మానుకోవాలంటూ వెల్లడించారు. తాను అవినీతిపరుడుని అయితే చంద్రబాబు కానిపాకం వినాయక గుడిలో వచ్చి ప్రమాణం చేస్తారా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.. ముఖ్యంగా అసెంబ్లీలో నారా భువనేశ్వరి పైన వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు అంటున్నారు.. అసలు ఆ సమయంలో తాను అసెంబ్లీలోనే లేనని పంజాబ్ వంటి ప్రాంతాలలో ఉన్నానని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గుడ్డ కాల్చి మీద వేస్తే ఎవరైనా నిరూపించుకోవాలా అంటూ ఫైర్ అయ్యారు వల్లభనేని వంశీ..ఇప్పటికే వల్లభనేని వంశీ గన్నవరంలో రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు.. 2009లో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు.


2014లో టిడిపి నుంచి గన్నవరం టికెట్ సాధించిన గెలిచారు. 2019లో కూడా అదే నియోజకవర్గ నుంచి గెలిచి మరో విజయాన్ని అందుకున్నారు. ఇటీవలే వైసిపిలో చేరడం వల్ల అధికార పార్టీకి ఆయన బాగా కలిసి వచ్చిందని కూడా చెప్పవచ్చు. మరి ఈసారి ఎన్నికలలో కూడా వైసిపి పార్టీ నుంచే పోటీ చేస్తున్నారు వల్లభనేని వంశీ.. గన్నవరంలో రాజకీయాలు ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి.. టిడిపి పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు..మరి ఇలాంటి సమయంలో అక్కడి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారా అనే విషయం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: