యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ని అందించారు. సాహో సినిమాతో రెండేళ్ల తర్వాత వెండితెర మీద కనిపించబోతున్న ప్రభాస్ ఇప్పుడిప్పుడే మళ్ళీ తన అభిమానులకు చేరువ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సాహో ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా తిరుగుతున్నాడు. అయితే నిన్న ప్రభాస్‌ తన అభిమానులకు సోషల్‌మీడియా ద్వారా సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. 


ఈరోజు సాహో’లోని నాలుగో పాటను విడుదల చేయబోతున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చెప్పిన విధంగానే నేడు ప్రభాస్ అభిమానులకు  సర్‌ప్రైజ్ నిఇచ్చారు. 'బేబీ ఓన్ట్‌ యు టెల్‌ మీ..' అంటూ సాగే పాటను అభిమానుల కోసం విడుదల చేసారు. రిచ్ బ్యాక్ గ్రౌండ్ లో శ్రద్దా, ప్రభాస్ మధ్య వచ్చే ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 


గిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ సోల్ ఫుల్ మెలోడీ సినిమాకు హైలైట్ గా మారుతుందని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అయితే సినిమాను ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉన్న విమర్శించే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. అలానే ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ అస్సలు ఈ సినిమా యాక్షన్ సినిమానా లేక రొమాంటిక్ సినిమానా అని కామెంట్ చేశారు. 


ఈ కామెంట్ కి మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ 'ముందు సినిమా చూడు ఆ తర్వాత మాట్లాడు అంటూ ఫైర్ నెటిజన్లు. కాగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ఆగస్టు 30 న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తాడా ? లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా చూడటం కోసం రామ్ గోపాల్ వర్మ వెయిట్ చేస్తున్నాడట.  


మరింత సమాచారం తెలుసుకోండి: