టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీ తర్వాత వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ మూవీలో నటించాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.
ఉగాది పండుగ సందర్బంగా ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. రౌద్రం రణం రుధిరం మోషన్ పోస్టర్ గ్రాఫిక్స్ తో దుమ్మురేపింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా పనులు నడుస్తున్నాయి. ఈ మూవీ రాజకీయ నేపథ్యంతో పాటు ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ గా ఉండబోతుందట.
వచ్చే ఏడాది జూన్ మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు వుంది. ఒక కథానాయికను బాలీవుడ్ నుంచి పరిచయం చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ మూవీ పై అప్పుడే ఎన్నో అంచనాలు పెరిగిపోతున్నాయి.