అనసూయ ..ఓ యాంకర్ నే కానీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మరి ముఖ్యంగా యాంకర్ అనసూయ పై సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి . అంతేకాదు దానికి తగ్గట్టే అనసూయ ఇచ్చి పడేస్తూ ఉంటుంది . రీసెంట్గా షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు స్టేజి పైన "చెప్పు తెగుద్ది" అంటూ ఎంత బోల్డ్ గా మాట్లాడి అభిమానులకు షాక్ ఇచ్చిందో అందరం చూసాం . కాగా రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకొని వావ్ అనిపించింది . కొల్లగొట్టి నాదిరో సాంగ్ లో స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చి శభాష్ అంటూ తన డాన్సింగ్ స్టైల్  కు ప్రశంసలు దక్కేలా చేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త అనసూయ కి సంబంధించి బాగా ట్రెండ్ అవుతుంది.
 

అనసూయ మరో ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.  ఈసారి కూడా మెగా హీరోతోనే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఆ హీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. యస్  గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న చరణ్ ప్రెసెంట్ "పెద్ది" సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.  ఈ సినిమా షూటింగ్ అంత సజావుగా సాగుతున్న ఐటమ్ సాంగ్ విషయంలో మాత్రం బిగ్ కన్ఫ్యూషన్ ఉంది.  ఏ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించాలి అంటూ తెగ టెన్షన్ పడిపోతున్నారు మేకర్స్ .



అయితే నిన్న మొన్నటి వరకు తమన్నా అని శ్రీలీల అంటూ రకరకాల పేర్లు వినిపించాయి . వీళ్ళందరూ కాదు అని గ్రేస్ ఉన్న హాట్ బ్యూటీని ఈ పాటకు సూట్ అవుతుంది అంటూ అనసూయను ఫైనలైజ్ చేసే పనిలో బిజీ అయిపోయారట మూవీ మేకర్స్.  రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా బాగా స్టెప్స్ వేసింది . ఇక ఇంతకంటే ఏం కావాలి అనే విధంగా మూవీ మేకర్స్ అనసూయకు ఆఫర్ ను ఇచ్చారట . అనసూయ కూడా అందుకు ఓకే చేసినట్లు తెలుస్తుంది . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ ఫిలిం వర్గాలలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . కాగా బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం తమన్నా - శ్రద్ధ కపూర్ - శ్రీ లీల లాంటి స్టార్ హీరోయిన్స్ నే ముందుగా అనుకున్నారు . ఆ తర్వాత అనసూయని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: