టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా - ప్రియాంక రైనా దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. ఈరోజు ఉదయం ప్రియాంక, జూనియర్ రైనా కు జన్మనిచ్చినట్లుగా తెలుస్తుంది. కాగా ఇంతకుముందు వీరికి 4ఏళ్ళ పాప (గ్రేసియా) ఉండగా తాజాగా అబ్బాయి పుట్టడంతో ప్రస్తుతం రైనా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలాఉంటే గత కొంత కాలంగా టీమిండియా కు దూరంగా ఉంటున్న రైనా ఈఏడాది ఐపీఎల్ లో రాణించి ఆస్ట్రేలియా లో జరుగనున్న టీ 20 ప్రపంచ కప్ కు ఎంపిక కావాలనుకున్నాడు. అందులో భాగంగా ఇటీవల తన సహచరుడు ధోని తో కలిసి చెన్నై, చెపాక్ లో ప్రాక్టీస్ కూడా చేశాడు. 
 
అయితే కరోనా, రైనా ఆశలపై నీళ్లు చల్లేలానే వుంది. దీని పుణ్యమాంటూ మార్చి 29 నుండి జరుగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ ఏప్రిల్ 15వరకు వాయిదాపడింది. ఇక రోజు రోజు కు దేశంలో కరోనా ప్రభావం తీవ్ర రూపం దాల్చుతుంది. ఇప్పటివరకు ఇండియాలో 415 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దాంతో చాలా రాష్ట్రాలు మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా  ఏప్రిల్ 15 తరువాత కూడా ఐపీఎల్ జరగడం కష్టమేనని తెలుస్తుంది. చాలా వరకు ఈఏడాది ఐపీఎల్ ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: