వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ కి భారత రత్న ఇచ్చే విషయంలో మహానాడు లో తీర్మానం చేయడంపై ఆయన తనదైన శైలి లో మండిపడ్డారు.
బతికున్నోళ్లను మభ్యపెట్టడానికి పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కించడం చూస్తుంటామన్న ఆయన... 25 ఏళ్ళ క్రితం మరణించిన ఎన్టీఆర్ ను భారతరత్న పేరుతో ఆటపట్టించడం ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేయడమే అని ఆయన ఎద్దేవా చేసారు. ప్రతి ఏటా తీర్మానం చేస్తారని... ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచమని తన మార్క్ లో పంచ్ వేసారు విజయసాయి రెడ్డి. ఇది వైరల్ గా మారింది.
బతికున్నోళ్లను మభ్యపెట్టడానికి పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కించడం చూస్తుంటాం. 25 ఏళ్ళ క్రితం మరణించిన ఎన్టీఆర్ ను భారతరత్న పేరుతో ఆటపట్టించడం ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేయడమే. ప్రతి ఏటా తీర్మానం చేస్తారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచం.
— Vijayasai reddy v (@VSReddy_MP) May 30, 2020