కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగును కొందరు చంపడంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏ మాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించారు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని అమల ఒక నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై కేంద్ర న్యాయ శాఖకు చేరే విధంగా ఒక సంతకాల కార్యక్రమాన్ని ఆమె మొదలుపెడుతూ ట్వీట్ చేసారు. దీనిని సంతకాలు చేసి కేంద్ర న్యాయ శాఖ వద్దకు చేరే విధంగా చెయ్యాలి అని ఆమె విజ్ఞప్తి చేసారు. దీనికి మంచి స్పందన వస్తుంది. ఇప్పటి వరకు లక్ష మందికి పైగా సంతాలు చేయడం విశేషం. దీనిపై కేంద్రం కూడా ఆగ్రహంగా ఉన్న సంగతి తెల్సిందే.
Very saddened at the poaching of elephants . Requesting your support to reach out to Ministry of Law and Justice, : Justice for our Voiceless friends - Sign the Petition! https://t.co/74hhHjff5C via @ChangeOrg_India
— amala akkineni (@amalaakkineni1) June 4, 2020