ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలుస్తాడని గత ఎన్నికలకు ముందు రాజకీయ ప్ర్మముఖులు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సరైన అవగాహన లేక అప్పుడు రాంగ్ స్టెప్ తీసుకుని ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయాడు. పార్టీ పెట్టకముందు నుండి కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ మరియు బీజేపీ లతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చాడు. అందుకే పార్టీ పెడుతున్నాను అని అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలప్పుడు టీడీపీకి హెల్ప్ అవుతాడని టీడీపీ నాయకులు మరియు అభిమానులు ఊహించారు. కానీ ఎవరి సలహా తెలియదు.. పవన్ 2019 ఎన్నికల్లో అటు బీజేపీ తో కానీ ఇటు టీడీపీ తో కానీ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళాడు.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు చోట్ల గాజువాక మరియు భీమవరం నియోజకవర్గాలలో పోటీ చేశాడు. కానీ అభిమాన గణం ఓట్లు వేయకపోవడంతో స్వల్ప మెజారిటీతో పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలయ్యాడు జనసేనాని. ఇక పార్టీ మొత్తానికి గెలిచిన ఒకే ఒక సీటు రాజోలు నియోజకవర్గం నుండి రాపాక వరప్రసాద్. కానీ ఆ తర్వాత ఈయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు. కాగా రానున్న ఎన్నికలలో అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అవుతాడా అని సొంత పార్టీ నేతలు మరియు రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేసుకుంటున్నారు.

అయితే జనసేన వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈసారి రెండు చోట్ల కాకుండా కేవలం ఒక చోటు నుండే పోటీ చేస్తాడని, అది కూడా భీమవరం నియోజకవర్గం నుండి మాత్రం పోటీ చేస్తారట. తాజాగా పవన్ మరియు చంద్రబాబు ల భేటీ అనంతరం వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ ఖచ్చితంగా పొత్తులు పెట్టుకునే ఎన్నికలకు వెలుతారన్నది స్పష్టం అవుతోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లు సాధిస్తుంది అన్న విషయం పక్కన పెడితే ఈ రెండు కారణాల వలన పవన్ కళ్యాణ్ గెలుపు బావుటా ఎగురవేస్తాడని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మరి వాస్తవంగా ఏమి జరగనుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: