ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలు అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇక మరో రెండు రోజులు మాత్రమే ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. దానితో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ప్రచారాలను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే నాయకులు అంతా కొన్ని ప్రాంతాలను కచ్చితంగా గెలవాలి అని చూస్తున్నారు. అందులో టీడీపీ పార్టీ తమకంచుకోట అయినటువంటి పెనమలూరు లో ఈ సారి ఎలాగైనా గెలవాలి అని టీడీపీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గం లో వైసీపీ పార్టీ నుండి  పార్థ సారధి గెలుపొందారు.

ఇక ఈయన ఈ సారి కూడా తనకే ఈ ప్రాంత టికెట్ ను ఆశించారు. కానీ జగన్ ఇందుకు సానుకూలంగా లేకపోవడంతో ఈయన చాలా రోజుల క్రితమే టీడీపీ లోకి జాయిన్ అయ్యారు. అలాగే తన కేడర్ మొత్తాన్ని కూడా టీడీపీ కి సపోర్టుగా తీసుకువెళ్లారు. ఇక ప్రస్తుతం ఈ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్‌ , టిడిపి అభ్యర్థిగా బోడే ప్రసాద్‌ తో పాటు మరో తొమ్మిది మంది పోటీలో ఉన్నారు. ఇంత మంది సభ్యులు ఉన్నా కానీ పోటీ మాత్రం జోగి , బోడే మధ్య సాగబోతోంది. ఇకపోతే వైసీపీ అభ్యర్థి అయినటువంటి జోగి రమేష్ ఈ ప్రాంతానికి కొత్త. ఇది ఈయనకు పెద్ద మైనస్ లా మారింది.

ఇక బోడె కు మొదట కూటమి టికెట్ ను నిరాకరించింది. అయినప్పటికీ ఈయన రెబల్ అభ్యర్థిగా పోటీలోకి దిగడానికి రెడీ అయ్యారు. ప్రచారాన్ని కూడా మొదలు పెట్టాడు. ఇక దానితో చివరగా దిగివచ్చిన అధిష్టానం ఈయనకు టికెట్ ను ఇచ్చింది. దానితో ఈయన ప్రస్తుతం ప్రచారాలను జోరుగా ముందుకు సాగిస్తున్నాడు. ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే వైసీపీ అభ్యర్థి జోగి నాన్ లోకల్ కావడం , టీడీపీ అభ్యర్థి బోడే లోకల్ వ్యక్తి కావడం , అలాగే ఈ ప్రాంతం టీడీపీ కంచుకోట కావడంతో ఈ సారి ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థి బోడే గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: