మన దేశంలో ఓ వైపు ధాన్య రాశులు గుట్టల్లా పేరుకుపోతున్నా.. మరోవైపు గుప్పెడు ఆహారం దొరక్క జనం ఆకలితో అల్లాడుతున్నారు. ఐక్య రాజ్య సమతి తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే కాదు భారతదేశంలోనూ ఆకలి సమస్య తీవ్రంగానే ఉంది.


ఐక్య రాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం..ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 2004-06 సంవత్సరాల మధ్య 12.2 శాతంగా ఉంది. 2019-21 మధ్య ఇది కేవలం 3 శాతం మాత్రమే తగ్గి 9 శాతానికి చేరుకుంది. ఇక భారత్‌లో 2004-06 మధ్య ఈ సంఖ్య 21.6 శాతంగా ఉండగా.. 2019-21 మధ్య 16.3 శాతానికి తగ్గింది. అంటే.. ఇంకా నూటికి 16 శాతం మంది ఆకలితో మగ్గిపోతున్నారు.


ఈ సంఖ్య చైనాలో కేవలం 2.5 శాతమే కాగా.. మన పక్కన ఉన్న నేపాల్‌లోనూ కేవలం 5.5 శాతమే కావడం విశేషం. ఇక పాకిస్తాన్‌లో మాత్రం దాదాపు మన పరిస్థితులే ఉన్నాయి. అక్కడ ఆకలితో మగ్గుతున్న వారి సంఖ్య జనాభాలో 16.9 శాతంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: