రెండేళ్ల నుండి కెరీర్ పరంగా సరైన
సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్, ఎట్టకేలకు తన తదుపరి సినిమాని
త్రివిక్రమ్ తో అనౌన్స్ చేయడం, ఆ తరువాత దానిని మొదలెట్టి ఆల్మోస్ట్ పూర్తి చేసే స్థితికి చేరుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమానే అలవైకుంఠపురములో. ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీగానే అంచనాలు నెలకొని ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జులాయి మరియు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయవంతం అవడంతో వీరిద్దరూ ఈసారి తప్పకుండా హ్యాట్రిక్ కొడతారని అంటున్నారు.
బన్నీ ఒక
సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన పూజ హెగ్డే
హీరోయిన్ గా నటిస్తుండగా టబు,
మురళి శర్మ,
సుశాంత్,
నివేత పేతురాజ్,
సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ
సినిమా కథ ఇదేనంటూ కొద్దిరోజలుగా పలు సోషల్
మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ఒక వార్త ప్రచారం అవుతోంది. అయితే అది అసలు ఆ
సినిమా కథేనా లేక కాదా అనే విషయం అటుంచితే, ఈ
సినిమా ఒరిజినల్ కథ, గతంలో బన్నీ,
త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకి చాలావరకు దగ్గరగా ఉంటుందట. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కొడుకుగా ఎన్నో మెట్లు దిగిమరీ తండ్రిని గెలిపించి ఆయన కళ్ళలో చివరకు ఆనందం చూస్తాడట హీరో.
అయితే ఆ సినిమాలో మాత్రం తండ్రి చనిపోగా, ఇందులో తండ్రి బ్రతికే ఉంటాడట. అయితే ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ,
త్రివిక్రమ్ సన్నిహితులు మాత్రం ఇది కొంతవరకు కరెక్ట్ అనే చెప్తున్నట్లు టాక్. ఏది ఏమైనా అలవైకుంఠపురములో
సినిమా రిలీజ్ అయ్యేవరకు కూడా ఈ వార్తలో నిజానిజాలు చెప్పలేం అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం
జనవరి 12వరకు వెయిట్ చేయాల్సిందే.....!!