
ఎక్కువమంది భోజనం తిన్న తర్వాత ప్లేట్లో కచ్చితంగా ప్లేట్లు కడుగుతూ ఉంటారు అయితే ఈ తప్పు చేయడం వల్ల ఆహారం నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుందట.. అంతేకాకుండా తినే ఆహారాన్ని మనం అవమానించినట్లే అవుతుందంటూ పండితులు హెచ్చరిస్తున్నారు.. మనం అన్నం తిన్న తర్వాత చెయ్యి ప్లేట్లో కడుక్కోవడానికి బదులు బయట చెట్ల దగ్గర కడుక్కోవడం చాలా మంచిదట. భోజనం చేసిన వెంటనే ఆ పాత్రలను మొత్తం ఆ సమయంలోనే కడిగేయాలి ఉదయం పూట కడగడం మహా దరిద్రమట
భోంచేసేముందు కచ్చితంగా అన్నపూర్ణాదేవిని స్మరించుకోవడం చాలా మంచిదని పండితులు తెలుపుతున్నారు. వారంలో కనీసం ఒక్కరోజైనా సరే ఏవైనా మూగజీవాలకు అన్నం పెట్టడం చాలా మంచిదట.. ప్రతిరోజు ఇలాంటివి చేయకపోవడం వల్ల వారి జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.ముఖ్యంగా గ్రహాలు కూడా ఇలాంటి సమయంలో వ్యతిరేకంగా పనిచేస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే వారు మానుకోవడం చాలా మంచిదట.
సాయంత్రం వేళ ఎవరైనా ఇంటి దగ్గరకు వచ్చి అన్నం అడిగినట్లు అయితే పెట్టడం చాలా మంచిదట. ఇలాంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి వారి ఇంటికి తలుపు తడుతుందని పండితులు తెలియజేస్తున్నారు.