ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా చిన్న గొడవ కారణంగా బీహార్ లో ఒక వ్యక్తి ఏకంగా తన చెవిని పోగొట్టుకున్నాడు అని చెప్పాలి. బీహార్ వైశాలి జిల్లాకు చెందిన మనేశ్వర్ ఠాగూర్ అనే వ్యక్తి కుటుంబానికి పక్కనే తన చెల్లి కూడా నివాసం ఉంటుంది. అయితే రెండు కుటుంబాల మధ్య తరచూ ఏవో చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉండేవి అని చెప్పాలి. స్థానికులు కూడా ఈ గొడవలను చూసి చూడనట్లుగానే వ్యవహరించేవారు. అయితే గత కొన్ని రోజుల క్రితం మహేశ్వర్ ఠాగూర్ తన చెల్లెలు ఇంటి వద్ద ఉన్న పొడి వంట చెరుకుపై తడివంట చెరకు పెట్టాడు.
అయితే మామయ్య మనేశ్వర్ ఠాగూర్ ఇలా చేయడంతో మనేశ్వర్ చెల్లి కొడుకు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే దుర్భాషలాడాడు. ఇలా వంట చెరుకు విషయంలో ఇద్దరు మధ్య గొడవ తలెత్తింది. చివరికి చిలికి చిలికి గాలి వానా
లా మారిపోయింది. దీంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన మనేశ్వర్ అల్లుడు అతనిపై దాడి చేశాడు. ఏకంగా చెవిని కొరికేశాడు. ఇలా వీరి వివాదం ఒక్కసారిగా ముదరడంతో స్థానికులు కలగజేసుకుని మనేశ్వర్ ను హాస్పిటల్కు తీసుకువెళ్లగా ఇక చెవిని అతికించడం వీలుకాదని వైద్యులు కూడా తెలిపారు. అందుకోసం భారీగా ఖర్చుపెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అంటూ సూచించారు.