ఇందిరా పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ ఈ నెల12న చెపట్టే ధర్నా ఏర్పాట్లు పరిశీలించారు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత.  ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కామెంట్స్  చేశారు...తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారు... వారికి మద్దతుగా టిఆర్ఎస్ హైదరాబాద్ లో ఈ నెల12న భారీ ధర్నా  చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో  సాగు విస్తీర్ణం పెరిగింది.... దేశానికి అన్నం పెట్టే రాష్ట్ర0గా తెలంగాణ ఎదిగిందన్నారు. కేంద్రం తెలంగాణను ప్రోత్సహించకుండా... ఇబ్బంది పెడుతుందని తెలిపారు.  కేంద్ర0 వ్యవసాయం రంగంలో నల్లచట్టాలని తెచ్చిందని... రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు.  

కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు నిరంతర పోరాటం చేస్తామని... రాష్ట్రాల నడ్డి కేంద్రం విరు స్తుం దన్నారు  మంత్రి తలసాని.  బిజేపీ రాష్ట్ర నేతలు డ్రామాలు చేస్తున్నారని...  దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామని స్పష్టం చేశారు తల సాని.   పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీజేపీ నేతలని పిలిచి చెప్పాలని కేంద్ర బీ జే పీ నేతలను కోరుతున్నామన్నారు  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ఈ నేల12 వ తేదిన జరిగే రైతు మద్దతు ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో పయని స్తుట్టే... కేంద్ర ప్రభు త్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. *తెలంగాణ రాష్ట్రంలో తెలం గాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్దెత్తున... ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో వరి సాగు పెరిగిందని వెలిపారు మంత్రి తలసాని. 

మరింత సమాచారం తెలుసుకోండి:

trs