టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడిగా మారిన తరువాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రభాస్ హీరోగా మిర్చి సినిమాతో దర్శకునిగా కొరటాల శివ కెరీర్ మొదలైంది.తన తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ తో కొరటాల శివ సత్తా చాటారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కొరటాల శివ కొత్తగా చూపించడంతో పాటు ఈ సినిమాలో కొరటాల శివ ఇచ్చిన మెసేజ్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తర్వాత రెండో సినిమా సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీమంతుడు పేరుతో తెరకెక్కగా ఈ సినిమా సమాజంలో మార్పుకు కారణమైందనే సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడినని చెబుతూ పలు గ్రామాలను దత్తత తీసుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే.


ఇంకా మూడో సినిమాగా కొరటాల శివ డైరెక్షన్ లో జనతా గ్యారేజ్ తెరకెక్కగా నెగిటివ్ రివ్యూలతో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రెండో సినిమా తీస్తే దర్శకునికి తొలి సినిమాను మించిన హిట్ దక్కదని ఇండస్ట్రీలో పేరుంది. అయితే భరత్ అనే నేను సినిమాతో కొరటాల శివ ఇక ఆ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేశారు. ఈ సినిమా 100 కోట్ల పైగా షేర్ వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించింది.ఇక ఆచార్య తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే కొరటాల శివ సినిమాల ద్వారా మొత్తం 60 కోట్లరూపాయల నుంచి 70 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని సమాచారం తెలుస్తోంది. ఇక ఈ స్థాయిలో ఆస్తులను సంపాదించిన దర్శకులలో కొరటాల శివ ఒకరు కావడం గమనార్హం. కొరటాల శివ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలు అందుకోవాలని అతను హిట్ ఇచ్చిన హీరోల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: