ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బబ్లీ హీరోయిన్ రాశిఖన్నా. మొదటి చిత్రంతోనే మంచి హిట్ కొట్టింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. తెలుగులో ప్రస్తుతం వున్న హీరోయిన్లలో రాశిఖన్నా చాలా అందంగా, బబ్లీగా, సింపుల్ గా కనిపిస్తుంది. అలాగే తన నటన, గ్లామర్ తోనే కాకుండా అదనంగా తన గానంతో కూడా మంచి క్రేజ్ ను ఏర్పరచుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన `సుప్రీమ్` చిత్రంతో మంచి హిట్ కొట్టింది. ఆ చిత్రంలో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో కనిపిస్తుంది. బెల్లం శ్రీదేవి పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో ఓ అమాయకపు పాత్రలో సాయి ధరమ్ తేజ్కి కూడా సరైనా జోడిగా కనిపిస్తుంది.
ఆ తర్వాత రవితేజతో బెంగాల్ టైగర్ మూవీలో కూడా నటించింది. కానీ అందులో ఆశించినంత పేరు రాలేదు. సుప్రీమ్ చిత్రం తర్వాత కాస్త డవున్ అయింది. తిరిగి మళ్ళీ రాశిఖన్నా మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతి రోజూ పండగే చిత్రంతో మళ్ళీ హిట్ కొట్టింది. అంటే సాయిధరమ్తేజ్ రాశికి లక్కీ హీరో అనుకోవాలా ఆయనతో కలిసి నటించిన చిత్రాలు హిట్ కొడుతున్నాయి. ఇక మొదట్లో కాస్త బొద్దుగా ఉండే ఈ భామ ఈ మధ్య కాలంలో సన్నగా నాజూకుగా తయారయింది. ఆ చిత్రంలో రాశిఖన్నాటిక్టాక్కు అడక్ట్ అయిన పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె టిక్టాక్కు బానిస అయింది నిజ జీవితంలో కాదు.. సినిమాలో భాగంగా.. ప్రస్తుతం ఈ భామ.. మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేస్తోంది. మారుతి తన సినిమాల్లో హీరోలకు ఏదో ఒక ప్రాబ్లెమ్తో బాధపడుతుంటాడు. అలాగే ఈ సినిమాలో హీరోకు కాకుండా హీరోయిన్కు టిక్ టాక్కు బానిస అయిన ఒక అమ్మాయి క్యారెక్టర్లో నటించి మెప్పించింది.
ఇక ఈ చిత్రంలో రాశి గ్లామర్తో పాటు తన అమాయకపు టిక్టాక్ పిచ్చి ఉన్న పాత్రలో అదరగొట్టిందని చెప్పాలి. దాంతో ఆమెకు సాయిధరమ్తేజ్ కూ అలాగే వేరే నటులతో ఆమె కాంబినేషన్లో ఉండే సీన్స్ చిత్రంలో ఫుల్ కామెడీగా ఉంటాయి. ఈ సినిమా మంచి హిట్ అయిందని చెప్పాలి. మరి ప్రస్తుతం రాశి తెలుగులో ఏ చిత్రానికి సంతకం చేయలేదు. సూర్య హీరోగా ఓ తమిళ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. మరి ఎంత వరకు నిజమనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.