సాధారణంగా వర్షాకాలం మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే వేడి నుంచి ఉపశమనం కలిగించి దాంతోపాటు అనేక సీజనల్ వ్యాధులను కూడా తనతో పాటు తీసుకొస్తుంది. అందుకే వర్షాకాలం అంటే ఎంత ఇష్టపడతారో అంతే భయపడతారు కూడా.. ఇక ఈ సీజనల్ వ్యాధుల వల్ల మన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక సీజనల్ వ్యాధులు అంటే జలుబు , దగ్గు, ఫ్లూ, టైఫాయిడ్ లాంటి రోగాలతో పాటు దోమలు పెరగడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు కూడా ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి. అందుకే చాలా వరకు ఇంటి పరిశుభ్రత పాటించాలి అని.. సాధ్యమైనంతవరకు నీటిని నిల్వ చేయకూడదని WHO స్పష్టం చేసింది.

వర్షాకాలం వచ్చే ముందు కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. లేకపోతే రోగాల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనలో రోగనిరోధక శక్తి బలపడాలి. అప్పుడే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.  ఇక వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది . కాబట్టి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం నిషిద్ధం. ఇక ఈ సీజన్లో బ్యాక్టీరియా ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకోవద్దు.  సీ ఫుడ్ కూడా తక్కువగానే తీసుకోవాలి . వర్షాకాలంలో సముద్రపు నీరు కలుషితమై ఇన్ఫెక్షన్లు వస్తాయి.

ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సీజన్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి.  అలాగే కొన్ని ఆహార పదార్థాలను దూరం చేయాలి. ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరిని తీసుకోవాలి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తో కూడిన అవిస గింజలు, బాదంపప్పులు, వాల్నట్ వంటివి సూపర్ ఫుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బెర్రీలు,  చెర్రీ , తాజా ఖర్జూరాలు,  దానిమ్మ వంటివి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: