
ఇది టైప్-2 డయాబెటిక్ రోగులకు మంచిది. రాగి జావ తిన్న తర్వాత ఎక్కువసేపు నిండిన భావం కలుగుతుంది. ఇది ఆకలి తగ్గించి అధికంగా తినకుండాచేస్తుంది. రాగిలో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అజీర్తి, పొట్ట గట్టిపడడం లాంటి సమస్యలకు ఇది ఉపశమనం ఇస్తుంది. రాగిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి యానీమియా నుంచి ఉపశమనం ఇస్తుంది. రాగిలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఉండడం వలన హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గర్భిణీలకు, తల్లిపాలిస్తున్న స్త్రీలకు మంచిది. ఇది శక్తిని ఇస్తుంది, బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందిస్తుంది.
రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల, అధికంగా తీసుకుంటే కడుపులో గబ్బుగుబ్బు, వాయువు, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. రాగిలో గోయిట్రోజెన్స్ అనే పదార్థాలు ఉండటం వల్ల ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. అందుకే థైరాయిడ్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. బాగా ఉడకపెట్టకుండా లేదా ఎక్కువగా ఇచ్చినట్లయితే జీర్ణతను దెబ్బతీయవచ్చు. మితిమీరిన తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు. చాలామంది రాగి జావను బెల్లం, పాలు, లేదా పంచదారతో కలిపి తింటారు. ఇవి అధిక క్యాలరీలను అందించి బరువు పెరగడం జరిగే ప్రమాదం ఉంది. రాగిలో ఫాస్ఫ ఎక్కువగా ఉండటంతో, దీన్ని అధికంగా తీసుకుంటే కిడ్నీలపై ఒత్తిడి వస్తుంది. కిడ్నీ సమస్యలున్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి.