ప్రస్తుత ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం కామెడీకి చిరునామాగా.. ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రతి వారం కూడా జబర్దస్త్ కమెడియన్స్ సరికొత్త స్కిట్లతో అటు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు. కొన్ని కొన్ని సార్లు జబర్దస్త్ కమెడియన్స్  సినిమాను స్పూఫ్  పూర్తి చేయడమే కాదు బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలను స్పూఫ్ కూడా చేయడం లాంటివి చేసి.. ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ ని పంచడం లాంటివి చేస్తూ ఉంటారూ. ఇక ఇలా ఏ స్కిట్ చేసిన ఫుల్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వుకునే విధంగానే ఉంటుంది.



 ఇకపోతే ఇటీవల రౌడీ రోహిణి  అంటూ ఏకంగా లేడీ కమెడియన్ రోహిణి కూడా జబర్దస్త్ లో టీం లీడర్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ టీమ్ లీడర్ గా నిలదొక్కుకుంటుంది. కాగా ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది టీం లీడర్ రోహిణి. జబర్దస్త్ జడ్జ్ గా ఉన్న రోజా పూర్ణ తో పాటు యాంకర్ రష్మీ ని కూడా స్టేజి మీదికి పిలుస్తుంది రోహిణి. అయితే ఇక ఈటీవీ లో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో కాన్సెప్ట్ ని జబర్దస్త్ లో స్పూఫ్ చేసి చూపించింది.


 ఈ క్రమంలోనే  తెల్ల వెంట్రుకలు నల్లగా మారడానికి ఎంత టైం పడుతుంది అంటూ ఒక ప్రశ్న అడుగుతుంది రోహిణి. రష్మి ఎంత టైం పడుతుంది అంటూ రోజా రష్మీ ని అడుగుతుంది. నన్ను ఎందుకు అడుగుతున్నారు మేడం అని అడగగా.. నువ్వే కదా ఒక్కో ఎపిసోడ్ కి మధ్యలో మూడు గంటల పాటు రూమ్ కి వెళ్తావ్ అంటూ పంచ్ వేస్తుంది రోజా.  దీంతో అందరు నవ్వుకుంటారూ. ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన సుమ అభిమానులను జబర్దస్త్ కార్యక్రమం లో కూడా మా అభిమాన యాంకర్ సుమ హవా కొనసాగుతుంది అని ఎంతో ఆనంద పడిపోతున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: