సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నికెవ్వరు సినిమాలతో వరుస విజయాలను అందుకున్న మహేష్ బాబు తాజాగా విడుదలయిన సర్కారు వారి పాట సినిమాతో మరో విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.  వీరిద్దరి కాంబినేషన్ లో  ఇది మూడో సినిమా. ఇది వరకే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అ అతడు ,ఖలేజా సినిమాలు తెరకెక్కాయి. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు తమన్ సంగీతం సమకూర్చ బోతూ ఉండగా, ఈ మూవీ లో  పూజా హెగ్డే, మహేష్ బాబు సరసన కథానాయికగా కనిపించబోతోంది . ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోం ది.

అయితే ఆ పాత్రను బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ చేయబోతున్నాడు అని అప్పట్లో అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాత్రను కన్నడ హీరో వి. రవిచంద్రన్ పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర ఈ సినిమా లో మహేష్ బాబు తండ్రి పాత్ర అని వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమా లోని ఈ కీలకమైన పాత్ర ను కన్నడ హీరో వి. రవిచంద్రన్ తో నటింపజేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు . ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: