తన మ్యూజిక్ తో సంగీత ప్రియులను మెస్మరైజ్ చేసే టాలీవుడ్  స్టార్  సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్  ఇక ఇప్పుడు లేటెస్టుగా ''ఓ పిల్లా'' అనే పాన్ ఇండియా పాప్ సాంగ్ తో వచ్చాడు.దేవి ఇటీవల 'ఓ పారి' అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చేతుల మీదుగా ఈ పాప్ సాంగ్ ను లాంచ్ చేయించారు. హిందీలో దేవిశ్రీప్రసాద్ రూపొందించిన తొలి మ్యూజిక్ ఆల్బమ్ ఇదే కావడం గమనార్హం.అయితే ఇప్పుడు అదే పాటని తెలుగు ఇంకా అలాగే తమిళ వెర్షన్స్ లో లాంచ్  చేశారు. తెలుగులో ''ఓ పిల్లా'' పేరుతో వచ్చిన ఈ సాంగ్ ని బిగ్ బాస్ రియాలిటీ షో వేదికగా కింగ్ అక్కినేని నాగార్జున లాంచ్ చేశారు. అలానే తమిళ్ వెర్షన్ 'ఓ పెన్నీ' గీతాన్ని  కమల్ హాసన్ రిలీజ్ చేసి దేవిశ్రీప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు.'ఓ పిల్లా.. నీ కన్నులే ట్వింకిల్ ట్వింకిల్ స్టార్స్.. ఓ పిల్లా నీ మాటలే ఫైవ్ స్టార్ చాక్లెట్స్..' అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 


ఈ సాంగ్ కు దేవిశ్రీప్రసాద్ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటుగా.. స్వయంగా పాడాడు. ఇందులో నటించడమే కాదు.. అన్ని భాషల్లో లిరిక్స్ కూడా అందించారు.ఈ సాంగ్ కి కాన్సెప్ట్ డిజైన్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్  ఇంకా అలాగే దర్శకత్వ బాధ్యతలు కూడా దేవీనే నిర్వహించడం విశేషమని చెప్పాలి. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ పాటను ప్రెజెంట్ చేశారు. స్పెయిన్, అమెరికా,  ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అందమైన లొకేషన్స్ లో ఈ మ్యూజిక్ వీడియోని షూట్  చేసినట్లు తెలుస్తోంది. ఇందులో దేవిశ్రీప్రసాద్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో తనదైన సింపుల్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత డీఎస్పీ ఇలా సాంగ్ లో ఆడిపాడటంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో బిగ్ స్క్రీన్ మీదకు కూడా వస్తే చూడాలని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: