ప్రస్తుతం మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల సంపాదన ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర హీరోల వారసులే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లుగా రాణిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మొదలుకొని అక్కినేని, నందమూరి, ఘట్టమనేని ఇలా ఆయా ఫ్యామిలీస్ లో ఉన్న స్టార్ హీరోల వ్యక్తిగత విషయాల కు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చిన అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అలా తాజాగా తెలుగులో ఏ అగ్ర హీరోకు ఖరీదైన ఇల్లు ఉందనే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. వాటిల్లో ప్రస్తుతం చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునల ఇల్లు చాలా ఖరీదైనవిగా తెలుస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవికి మణికొండ దగ్గరలో 84 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది.దానితో పాటు రీసెంట్ గానే ఆయన మరో ఇంటిని కూడా కొనుగోలు చేశారు.దాని ధర సుమారు 60 కోట్ల దాకా ఉంటుందని సమాచారం వినిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం లోనే ఖరీదైన ఇల్లు ఉంది కేవలం మన మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే. ఆయన భవిష్యత్ లో తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధునాతన సౌకర్యాలతో ఇంటిని డిజైన్ చేసుకున్నారు.ప్రస్తుతం తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి ఆయన ఒకే ఇంట్లో ఉంటున్నారు. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ కూడా వాళ్లతోనే ఉంటుంది. రీసెంట్ గానే తన కూతురు శ్రీజ కోసం చిరంజీవి ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి తర్వాత అత్యంత ఖరీదైన ఇల్లు కలిగి ఉన్న మరో హీరో అక్కినేని నాగార్జున.నాగార్జున కి బంజారాహిల్స్ లో 45 కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది. ప్రస్తుతం ఇదే ఇంట్లో తన కొడుకులతో కలిసి ఉంటున్నాడు. ఇక మహేష్ బాబు ఉండే ఇంటి ధర సుమారు 25 కోట్లు ఉంటుంది. అల్లు అర్జున్ ఉంటున్న ఇల్లు కూడా సుమారు 25 నుంచి 30 కోట్ల మధ్యలోనే ఉంటుంది. ఎన్టీఆర్ కూడా 30 కోట్ల ఖరీదైన ఇంట్లోనే ఉంటున్నాడు. ఈమధ్య హైదరాబాద్ అవుట్ స్కట్స్ లో ఎన్టీఆర్ ఓ ఫామ్ హౌస్ ని కూడా కొనుగోలు చేశారు. దీని విలువ 7 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ ఫామ్ హౌస్ ని గత ఏడాది తన భార్య లక్ష్మి ప్రణతికి బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడు తారక్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: