ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మొబైల్ నెంబర్ ఇచ్చామంటే చాలు.. పలు బ్యాంకు సంస్థల నుండి హెల్త్ ఇన్సూరెన్స్ , రియల్ ఎస్టేట్ వాటి నుంచి మీకు లోన్ కావాలా ఇన్సూరెన్స్ కావాలా వంటివి ఎక్కువగా కాల్స్ వస్తూనే ఉన్నాయి .ఇలాంటివి చాలా మంది ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫోన్ కాల్స్ తో పాటు మెసేజ్లు కూడా పలు రకాలుగా వస్తూనే ఉన్నాయి.. ఇలాంటి జంక్ కాల్స్ ని లిఫ్ట్ చేయకుండా ఉండడమే ఉత్తమమైన పని అని చెప్పవచ్చు. అయితే మొబైల్ కి దూరంగా ఉంటే ఏదో అర్జెంట్ కాలనీ మనం వెళ్తే అది తీరా చూస్తే కస్టమర్ కేర్ నుంచి వస్తూ ఉంటుంది..


ఇలాంటి విసుగు తెప్పించే అనుభవాలు ఇకమీదట వినియోగదారులకు ఉండకుండా చూసేందుకు టెలికాం సంస్థలు ట్రామ్ చర్యలు తీసుకోబోతున్నారు.. చికాకు పుట్టించే కాల్స్ మెసేజ్లకు చెక్ పెట్టే బాధ్యతలను టెలికాం ఆపరేటర్లదేనని తేల్చి చెప్పేసింది.. అనధికారకంగా కాల్స్ మెసేజ్లను నియంత్రించేందుకు ఇప్పటికే కొన్ని టెలికాం దిగ్గజ సంస్థలు సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనధికారం మెసేజ్లను అరికట్టేందుకు అమలు చేస్తున్న బ్లాక్ చైన్ బ్రిడ్జ్.. డిస్ట్రిబ్యూటెడ్ లెగ్ జార్ టెక్నాలజీ (DLT) మే ఒకటి నుంచి ఈ కావాల్సిన కూడా వర్తింపచేసేలా తెలియజేస్తోంది.


అనధికార కాల్స్ ,మెసేజ్ వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకుండా చూసేలా ట్రామ్ ఇటీవల సమీక్ష నిర్వహించినది.ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ,ఐడియా వంటి టెలికాం దిగ్గజాలతో చేపట్టిన ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. అనధికార కాల్స్ మెసేజ్ వల్ల సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారని వీటివల్ల వినియోగదారులు నష్టపోతున్నారని తెలియజేసింది. స్కామ్  ల కారణమయ్యే కాల్స్ అన్నిటిని కనిపెట్టేలా మెషిన్ లెర్నింగ్ ఆధార వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు తెలియజేసింది. ఇలాంటి వాటిని అనుమతించేందుకు  ట్రామ్ కూడా వారికి అనుమతించింది. ఈ ప్రయోగాన్ని వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు మొదట ప్రయోగిస్తున్నాయి. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇతర ఆపరేటర్లు కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు ట్రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: