ఈటల రాజేందర్ మాత్రం తన వైఖరిలో స్పష్టతను ప్రదర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణంలో తనకు పరిమిత పాత్రే ఉందని, ఆర్థిక మంత్రిగా బడ్జెట్ కేటాయింపులకు మాత్రమే పరిమితమైనట్లు కమిషన్కు వివరించారు. బండి సంజయ్, కాంగ్రెస్ వైఫల్యాలపై దృష్టి పెట్టకుండా, బీఆర్ఎస్పై కుట్రలు పన్నుతున్నారని ఈటల సన్నిహితులు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం విచారణను రాజకీయంగా వాడుకుంటూ, కేసీఆర్ కుటుంబంపై దాడులు చేస్తున్న బండి, పార్టీలోని సొంత నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదం బీజేపీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడుతున్న ఈటలకు, సొంత పార్టీ నాయకుల నుంచి మద్దతు కొరవడినట్లు కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నప్పటికీ, ఈటల తన వాదనలతో నిజాయితీని నిరూపించే ప్రయత్నం చేశారు. తాను కేసీఆర్ను కాపాడటం లేదని, కేవలం వాస్తవాలను వెల్లడించానని ఈటల స్పష్టం చేశారు. అయితే, బండి సంజయ్ వైఖరి ఈటలను ఒంటరిగా నిలబెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం బీజేపీలో అంతర్గత సమస్యలను బయటపెట్టింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి