సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల హీరోగా వరుస సక్సెస్ లతో కొనసాగుతున్న విషయం తెల్సిందే. దానితో ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట పై అందరిపై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. మైత్రి మూవీ మేకర్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ సినిమా కి థమన్ సంగీతం అందించగా మది కెమెరా మ్యాన్ గా వ్యవహరించారు.

పలువురు టాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేసిన ఈ మూవీలో సముద్రఖని విలన్ పాత్ర చేయగా యువ భామ కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్, టీజర్ అందరి నుండి విపరీతమైన రెస్పాన్స్ అందుకోవడంతో మూవీ పై ఈ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు రానుండడంతో మొదటగా ఈ మూవీ ప్రివ్యూ టాక్ ని బట్టి చూస్తుంటే మూవీ ఎంతో అద్భుతంగా తెరకెక్కిందని అంటున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తన క్యారెక్టర్ లో సహజ నటన తో పేకాడేసాడని, అలానే కీర్తి సురేష్ కూడా అత్యద్భుతంగా నటించిందని చెప్తున్నారు.

వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అయితే మరొక లెవెల్లో ఉంటాయని, ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంతో మంచి ఎంటర్టైనర్ గా సాగె సర్కారు వారి పాట సెకండ్ కూడా మరింతగా ఆకట్టుకుంటుందని, సినిమాకి థమన్ సాంగ్స్, బీజీఎమ్ అయితే అదరహో అనే రేంజ్ లో ఉన్నాయట. మది గ్రాండియర్ విజువల్స్ కూడా సినిమాకి ఎంతో పెద్ద బలాన్నిచ్చాయని అంటున్నారు. ఫైనల్ గా దర్శకుడు పరశురామ్ మూవీని అందరినీ ఆకట్టుకునేలా తీసి మంచి మార్కులు కొట్టేశారని, తప్పకుండ నేటి నుండి సర్కారు వారి పాట మూవీ మంచి కలెక్షన్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టడం చాలా వరకు ఖాయంగా చెప్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: