'అందాలరాక్షసి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే దర్శక ధీరుడు రాజమౌళి నుంచి ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకర్శించింది. మనం సినిమాలో చిన్న గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్, అల్లు శిరీష్ తో  శ్రీరస్తు శుభమస్తు, మన్మధుడు నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయనా లాంటి సినిమాలతో హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఒకవైపు నాని, సాయి ధరం తేజ్ లాంటి యంగ్ హీరోల సరసన నటిస్తూనే నాగార్జున వంటి సీనియర్ హీరోలకి మంచి ఛాయిస్ లా మారింది.

 

అయితే ఇన్నాళ్ళు ఎందుకనో స్టార్ హీరోయిన్ గా మాత్రం రాణించలేదు. మొదటి సినిమా అందాల రాక్షసి సినిమా నుండి నటనకి ప్రాముఖ్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తుంది లావణ్య త్రిపాఠి. అదే మైనస్ గా మారడం తో రేస్ లో కాస్త వెనకపడిందనే చెప్పాలి. అయితే రీసెంట్ గా నిఖిల్ తో వచ్చిన 'అర్జున్ సురవరం' సినిమా తో సక్సెస్ కొట్టింది. 
దాంతో లావణ్య త్రిపాఠి మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చేసింది. తమిళంలో 'గద్దలకొండ గణేష్' ఫేమ్ అధర్వ మురళీ సరసన నటిస్తుంది. అలాగే సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్' లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తోంది. వీటితో పాటు కార్తికేయ హీరోగా నటిస్తున్న 'చావు కబురు చల్లగా'లో హీరోయిన్ గాను ఎంపికైంది. 

 

ఇక ఈ బ్యూటి టాలీవుడ్ స్టార్ హీరోలపైన ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. అది కూడా చాలా డీసెంట్ గా. అసలు లావణ్య లో ఇలాంటి  కోణం ఉందని ఎవరూ ఊహించరు. ప్రభాస్ … చాలా కూలెస్ట్ గా ఉంటాడని చెప్పిన లావణ్య… రాంచరణ్ అంటే ఓ అద్భుతమని.. జూనియర్ ఎన్టీఆర్ ను మరో హీరో ఎవరూ మ్యాచ్ చేయలేరని.. అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా ఉంటాడని ‘పుష్ప’ ఫస్ట్ లుక్ చింపేసింది.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ప్రతీ విషయం పైనా స్పందిస్తాడని.. ఆయన ధైర్యం పై ఆమెకి ఎంతో గౌరవం ఉందని.. ఇక మెగాస్టార్ చిరంజీవి నిజమైన హీరో అని… ఆమె ఆరాధించే నటుల్లో ఆయన కూడా ఒకరని చెప్పింది. ఇలా టాలీవుడ్ అగ్ర హీరోల గురించి నిశితంగా పరిశీలించే కోణం ఉందని ఇప్పటి వరకు ఎవరూ ఊహించరు.

మరింత సమాచారం తెలుసుకోండి: