
తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే కాళేశ్వరం అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశమంతా కరవు వచ్చినా తెలంగాణకు మాత్రం రాదన్నారు. నూతన తెలంగాణలో నిర్మించుకున్న అతిపెద్ద ప్రాజెక్టు మల్లన్న సాగర్ అని చెప్పారు. మల్లన్న సాగర్ ప్రారంభంతో కాళేశ్వరం కల సాకారమైందన్నారు. ఈ ప్రాజెక్టు ఆపేందుకు ఎన్నో కేసులు వేశారనీ.. అయినా వెనక్కి తగ్గలేదని తెలిపారు. పరిహారం అందని వారికి అందేలా చేస్తామన్నారు.
జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. వందకు వందశాతం తన మేధో సంపత్తిని ఉపయోగించి.. చివరి రక్తపు బొట్టు ధారబోసైనా సరే.. దేశాన్ని గాడిలో పెడతానని స్పష్టం చేశారు. ప్రశాంతమైన పాలనతోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయనీ.. కుల, మత విద్వేషాలు దేశానికి మంచివి కావన్నారు. వాటిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.